కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 19 ; పాతనేరస్తులు సత్ప్రవర్తన కలిగి ఉండాలని రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్ రమణ మూర్తి అన్నారు. మండలం లోని పాత నేరస్తులతో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్సపెక్టర్ మాట్లాడుతూ రాబోవు ఎన్నికలు, బక్రీద్, వినాయక చవితి, విజయ దశమి తదితర పండుగల సందర్భముగా ఎటువంటి అవాంఛనీయ, అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనకుండా ఉండాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని అన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై దీకొండ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment