Tuesday, 28 August 2018

సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే కెసిఆర్ ధ్యేయం

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 28 ; సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధి  కార్మికుల  సంక్షేమం    ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని టిబిజికెఎస్  బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాసరావు అన్నారు.  మంగళవారం  ఏరియాలోని డోర్లి    ఓపెన్ కాస్ట్ వద్ద జరిగిన   సమావేశంలో  ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాణసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కార్మికవర్గం మేలుకోసం నిర్ణయాలు తీసుకోవడంతో  జాతీయ సంఘాలు జీర్ణించుకోలేక సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.  జాతీయ సంఘాలు పోగొట్టిన హక్కులను తిరిగి సాధించుకుందామని పేర్కొన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సింగరేణి కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్నట్లు తెలిపారు సింగరేణి గడించిన  లాభాల్లో ఇరవై ఏడు శాతం వాటా ఈ నెల ఇరవై తొమ్మిది  న కార్మికులకు చెల్లిస్తున్నారనారు.  సింగరేణిలో పనిచేసే కార్మికులు ఇకనుంచి ఉద్యోగాలుగా పిలవాలని నిర్ణయం  చేయడం సంతోషకర మన్నారు గతంలో జాతీయ సంఘాల అవగాహన లోపంతో కుదుర్చుకున్న ఒప్పందంలో బోనస్ లో ఏడు శాతం పింఛన్ రికవరీ చేయడంలో కార్మికులు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని  తెబొగకాసం కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్ సదాశివ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిట్  కార్యదర్శి శంకర్, సమ్మయ్య, కొగిలాల రవీందర్, ఛార్లెస్, రామారావు, పిట్ కార్యదర్శి నర్సింగరావు,  అసిస్టెంట్ పిట్ కార్యదర్శి లు, మల్లేష్, మస్తాన్, భాను సతిష్, నాగేందర్, ప్రకాష్ నాయుడు, గంగి శెట్టి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment