Tuesday, 14 August 2018

గ్రామ పంచాయితి కార్మికుల వంటా వార్పూ తో నిరసన

కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 14 ; రెబ్బెన మండల కేంద్రంలో  గత 23 రోజులు గా  సమ్మె చేస్తున్న గ్రామ పంచాయితి కార్మికులు  మంగళవారం దీక్ష శిబిరం వద్ద వంటా వార్పూ తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శిబిరాన్ని సందర్శించి కార్మికులకు సంఘీభావం ప్రకటించిన ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బోగే ఉపేందర్, టిఆర్ఎస్ కెవి జిల్లా కార్యదర్శి నాగవల్లి సుధాకర్  లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదని వెంటనే స్పందించి కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని   అన్నారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుండ కార్మికులను చిన్నచూపు చూస్తుందని అన్నారు ఇప్పడికైనా ప్రభుత్వం పట్టించుకోని అర్హులైన కార్మికులందరిని  కార్యదర్శి గా నియమించి, జి ఓ  సవరించి అందరిని పెర్మనెంట్  చేయాలని అన్నారు. కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చెసారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో .ఏఐటీయూసీ జిపిడబ్ల్యూ యూనియన్ మండల అధ్యక్షుడు రాచకొండ రమేష్, కార్యదర్శి దుర్గం వెంకటేష్,వైస్ ప్రెసిడెంట్ గోగర్ల శంకర్, కార్మికులు దేవాజి, వీరయ్య, నారాయణ,లక్ష్మి, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment