కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 24 ; రెబ్బెన మండలం లోని పుంజు మేర గూడ గ్రామ యువకులకు శుక్రవారం తెరాస నాయకుడు ఆత్మారాం నాయక్ వాలీ బాల్ కిట్లను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో క్రీడా సామాగ్రిని అందచేయడం జరుగుతుందన్నారు. క్రీడా సాధన ద్వారా యువకులు ఆరోగ్యకరం గా ఉండడంతో పాటు చేడు వ్యసనాల బారిన పడకుండా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు భిక్షపతి , వెంకటేష్, సురేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment