కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 15 ; జిల్లా కేంద్రం లో మేదరి సంఘము భవనం నిర్మాణం కోసం స్థలం మరియు నిధుల మంజూరు కోసం బుధవారం ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ శ్రీమతి కోవ లక్ష్మీ కి రెబ్బన జడ్పీటీసీ అజ్మేర బాపురావు, రెబ్బన ఎంపీపీ కార్ణాధం సంజీవ్ కుమార్ ల సమక్షంలో మేదరి సంఘము జిల్లా ప్రధానకార్యదర్శి రాపాల శ్రీనివాస్ వినతిపత్రం అందజేయడం జరిగింది. అంతకు ముందు జిల్లా కేంద్రంలో జరిగిన 72 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో వెదురు తో చేసిన పలు ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ఈ కార్యక్రమంలో జి ల్లా యువజన సంఘం అధ్యక్షుడు గట్టు తిరుపతి, జిల్లా వెదురు పారిశ్రామిక సంఘము అధ్యక్షుడు గట్టురాజకనకయ్య, మహేంద్ర సంఘము నాయకులు కొంటు మహేందర్, లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment