కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 18 ; వరద భాదితులకు సహాయం చేసి మానవత్వాన్ని చాటుకోవాలని బెల్లంపల్లి సింగరేణి ఏరియా సింగరేణి సేవా సంస్థ అధ్యక్షురాలు అనురాధ రవిశంకర్ అన్నారు. శనివారం వారి ఆదేశానుసారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వరద భాదితుల సహాయార్ధం రెబ్బెన మండల గోలేటి కాలనీలో దుప్పట్లు, చీరలు మరియు వంట సామగ్రి సేకరించడం జరిగిందని డి వై పి ఎం జె కిరణ్ తెలిపారు. అదేవిధంగా సోమవారం గోలేటి టౌన్ షిప్ లో వరద భాదితుల సహాయార్ధం వస్తువులు సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ విధంగా సేకరించిన వస్తువులను ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారికి అందచేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఫై ఎం లు రాజేశ్వర్, సుదర్శనం, రామశాస్ట్రీ,సేవాసమితి సీనియర్ సభ్యులు కుందారపు శంకరమ్మ, సొల్లు లక్ష్మి, సేవ సభ్యులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment