కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 21 ; సేవా దృక్పధంతో మండల తెరాస మహిళా విభాగం నుంచి ప్రతి మంగళవారం ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఉపాహారం పంపిణి నిర్వహిస్తున్నవారిని ఐ కె పి వెలుగు కార్యక్రమం ఏపిఎం వెంకటరామణ శర్మ అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని ఉప్మా పంపిణి కార్యక్రమం చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ మండలం లోని ప్రజలు వీరి స్ఫూర్తి తో మరింతమంది సమాజ సేవకు ముందుకు రావాలని అన్నారు. ఈకార్యక్రమంలో ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, తెరాస మండల మహిళా టౌన్ అధ్యక్షురాలు మన్యం పద్మ, అన్నపూర్ణ అరుణ, ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ మాధురి, సూపర్ వైజర్ భాగ్య లక్ష్మి, రాజేశ్వరి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment