కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 31 ; రెబ్బెన మండలంలోని ఉపాధ్యాయులందరు సెప్టెంబర్ 1 న జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణా రాష్ట్ర పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్ మండల అధ్యక్షులు ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ లు పిలుపునిచ్చారు. శుక్రవారం రెబ్బెన లో విలేఖరులతో మాట్లాడుతూ సి పి ఎస్ విధానం రద్దుకై పి ఆర్ టి యు రాష్ట్ర శాఖా పిలుపు మేరకు సెప్టెంబర్ 1 న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.
No comments:
Post a Comment