కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 28 ; మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం రెబ్బెన టౌన్ తెరాస మహిళా అధ్యక్షురాలు మన్యం పద్మ గర్భిణీ స్త్రీలకు పులిహోరను అల్పాహారం గా అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలనుంచి పరీక్షలకై వచ్చే గర్భిణీ స్త్రీలకు తన వంతు ధర్మంగా అల్పాహారం క్రమం తప్పకుండా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో పాటుగా సమాజంలోని అందరు సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పావని, సునీత, ఆరోగ్యమిత్ర లావణ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment