Friday, 24 August 2018

భక్తి శ్రద్దలతో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజలు

కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 24 ; అత్యంత భక్తి శ్రద్దలతో  శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి రెబ్బెన మండలంలోని ప్రజలు వ్రతాలు చేసుకున్నారు. ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయంనుంచే భక్తులు డైవదర్శనంచేసుకొని వారి వారి ఇండ్లలో  వరలక్ష్మిఅమ్మవారి  పూజ చేసుకొని, ముత్తైదువులకు తమ శక్తానుసారం వాయినాలు సమర్పించారు. మండలంలోని ఇందిరానగర్    శ్రీ కనకదుర్గ దేవి శ్రీ స్వయంభూ మహంకాళి  అలయలో, వర లక్ష్మీ వ్రత పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి దేవార వినోద్, మరియు ఆలయ కమిటీ అధ్య క్షులు మోడెం తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షులు కొట్రంగి శ్రీనివాస్, రెబ్బెన  ఏం. పి. పి సంజీవ్ కుమార్, మొడెం సుదర్శన్ గౌడ్, సురేష్, మధుకర్, రమేష్, రెబ్బన వోకేషనల్  జూనియర్ కాలేజ్ విద్యార్దులు, ఊపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment