కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 26 ; తెలంగాణ జాగృతి వారి ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని బెజ్జూర్ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ అధికార ప్రతినిధి కె.నరేందర్ గౌడ్, పి.ఆర్.ఓ కనుకుట్ల వెంకటేష్ టి.జె.ఎస్.ఎఫ్ మండల అధ్యక్షులు జావిద్ అలీ ఖాన్ మాట్లాడుతు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి ఆదేశాల మేరకు జాగృతి జిల్లా అధ్యక్షులు పర్ష. చంద్రశేఖర్ సూచనలతో నేడు ఈ కార్యక్రమాన్ని బెజ్జుర్ మండల కేంద్రం లోని గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం అక్కాతమ్ముళ్ల సంబంధం విడదీయరాని ప్రేమానురాగాలు మరచిపోలేని మమతానురాగాలు ఈ పండగలో కనిపిస్తాయని అని అన్నారు. నాకు నీవు రక్ష నీకు నేను రక్ష మనం ఇద్దరం ఈ దేశానికి రక్ష అంటూ విద్యార్థినిలకు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగృతి విద్యార్థి సమైక్య మండల అధ్యక్షులు జావిద్ అలీ, వనవాసి కళ్యాణ్ పరిషద్ కాగజ్నగర్ నియోజకవర్గం నాయకులు పోల్కా.వెంకటేష్ ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్ధిరామ్ అధ్యాపకులు విద్యార్థినిలు ఉన్నారు.
No comments:
Post a Comment