Tuesday, 7 August 2018

గర్భిణీ స్త్రీలకు పులిహోర పంపిణి

    కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 07 ;  మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం   తెరాస మండల మహిళా పట్టణ మహిళ  అధ్యక్షురాలు మన్యం పద్మ ఆధ్వర్యంలో  గర్భిణీ స్త్రీలకు పులిహోర  పంపిణి చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా  ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ  కోవలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ   తెరాస మహిళా విభాగం ఆధ్వర్యం లో ప్రతి మంగళవారం చేపట్టే కార్యక్రమం ఎంతో  సూర్తి దాయకమన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ పెసర వెంకటమ్మ, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కుందారపుశంకరమ్మ, సీనియర్ నాయకురాలు అరుణ, ఆసుపత్రి సిబ్బంది  తదితరులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment