Saturday, 18 August 2018

ముంపు పంట భూములకు నష్టపరిహారం కై వినతి ; పరిశీలిచిన రెవెన్యూ అధికారులు

కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 18 ; గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద వాగు ఉప్పొంగి రెబ్బెన మండలం నవేగం గ్రామంలోని సుమారు 500 ఎకరాల పంట మునిగిపోయినట్లు నవేగం గ్రామస్తులు శనివారం రెబ్బెన మండల తహసీల్దార్ కు వినతి పత్రం అందచేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ తమ పొలాలలో   పత్తి, కంది, మిరప పంటలు పూర్తిగా మునిగి పోయినట్లు  తెలిపారు.  తమకు ప్రభుత్వం తరపున నస్టపరిహారం ఇపించాలని కోరారు.  తహసీల్దార్  స్పందించి  నవేగం గ్రామానికి వెళ్లి   జరిగిన నష్టాన్ని అంచనా వేయమని  అధికారులను ఆదేశించారు.  పంట చేనులను రెవెన్యూ  అధికారులు పరిశీలిచి నష్ట పరిహారాల పంట వివరాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో   మాజీ సర్పంచ్ జాదవ్ ప్రేమ్ దాస్, మండల  కాంగ్రెస్ ఎస్ సీ  సెల్ అధ్యక్షులు కుడుక మొండయ్య,  పావే వెంకటి, చౌదరి వగు, ఏకొంకర్  నానాజీ, బొర్కెటే భీంరావు లు ఉన్నారు. 

No comments:

Post a Comment