Wednesday, 29 August 2018

పెన్షన్ విద్రోహ సభలను విజయవంతం చేయాలి

కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 29 ; సెప్టెంబర్ 1 న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జరిగే ర్యాలీలు ,సభలలో ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొనాలని  జాక్టో,యు ఎస్ పి  సి ప్రతినిధులు చరణ్ దాస్ , రవికుమార్, రాజకమలాకర్ రెడ్డి, తుకారాలు పిలుపునిచ్చారు. రెబ్బెన మండలం జిల్లా పరిషత్ పాఠశాలలోబుధవారం  గోడప్రతులను విడుదల చేసి మాట్లాడారు. సి పి ఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని కోరారు. పెన్షన్ పొందడం ప్రతి ఉద్యోగి హక్కు అని గౌరవ సుప్రీ కోర్ట్ ఇచిన తీర్పుకు అనుగుణంగా పాత  పెన్షన్ విధానాన్ని ఆచరణలోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోహైమత్, శ్రీలత, పుష్పలత, శ్రీదేవి, షబానా బేగం, బాణేష్, గోపాల్, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment