కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 30 ; పౌరహక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి సమాజంలో బాధ్యతతో మెలగాలని రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్ రమణ మూర్తి, ఎస్సై దీకొండ రమేష్ లు అన్నారు. మండలంలోని ఇందిరానగర్ గ్రామస్తులతో ఏర్పాటుచేసిన సమావేశం లో పౌర హక్కుల గురించి మాట్లాడారు. ప్రజలందరూ తమ తమ హక్కులు , భాద్యతలు తెలుసుకోవాలని అన్నారు. దేశంలోని పౌరులందరూ రాజ్యాంగం ప్రకారం నడచులోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment