Saturday, 18 August 2018

ఎద్దుకు వినతి పత్రం ఇచ్చిన గ్రామ పంచాయతీ కార్మికులు

కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 18 ;  గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిస్కరించాలని  వినూత్న  నిరసన లో భాగంగా   ఎద్దుకు వినతి పత్రం ఇచ్చారు. నిరవదిక సమ్మె రెబ్బెనలో శనివారానికి 27వ రోజుకు చేరుకుంది.     ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, టి  ఆర్ఎస్ కేవి   జిల్లా కార్యదర్శి నగవెళ్లి సుధాకర్ లు  మాట్లాడుతూ ముఖ్యమంత్రి కి  గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించే  విధంగా చేయాలని అన్నారు.  అలాగే మంత్రి  కే టి ఆర్ కు  గతంలో ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చేయాలని కోరారు. కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని, అర్హులైన  వారందరిని పంచాయతీ కార్యదర్శి గా నియమించాలి  అని కోరారు.  పక్క రాష్ట్రంలో ఇస్తున్నట్లు వేతనాలు ఇవ్వాలని, కర్ణాటక రాష్ట్రము వలే ప్రత్యేక గ్రాంట్ కేటాయింపు చేయాలని అన్నారు. హక్కులు సాధించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని అన్నారు. ముఖ్యమంత్రి రోజుకో ప్రకటన చేస్తూ కార్మికులను గందరగోళం గా తయారు చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిస్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు రాచకొండ రమేష్,వైస్ ప్రెసిడెంట్ గోగర్ల శంకర్,లాలు సింగ,కోశాధికారి కళావేని తిరుపతి, నాయకులు బాబాజి,సత్యయ్య ,వెంకటేష్  తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment