Wednesday, 29 August 2018

బెల్లంపల్లి ఏరియా సింగరేణిలో లాభాల వాటా చెక్కుల చెల్లింపు



కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 29 ; సింగరేణి లాభాల వాటాల్లో ఇరవై ఏడు శాతం కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బుధవారం బెల్లంపల్లి ఏరియాలోని అన్ని గనుల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జిఎం రవిశంకర్  ప్రారంభించారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా , డిపార్ట్మెంట్ ల వద్ద అధికారులు చెక్కులను కార్మికులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా జీఎం  మాట్లాడుతూ కార్మికులు అధికారులు సమన్వయంతో పనిచేసి  ఈ సంవత్సరం కూడా  సంస్థను లాభాలబాటలో పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం  పర్సనల్ జె  కిరణ్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస రావు, ఓ సి పి  మేనేజర్ రమేష్, డీపీయం  రామశాస్ట్రీ, ప్రాజెక్ట్ ఆఫీసర్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment