కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 29 ; సింగరేణి లాభాల వాటాల్లో ఇరవై ఏడు శాతం కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బుధవారం బెల్లంపల్లి ఏరియాలోని అన్ని గనుల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జిఎం రవిశంకర్ ప్రారంభించారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా , డిపార్ట్మెంట్ ల వద్ద అధికారులు చెక్కులను కార్మికులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కార్మికులు అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ సంవత్సరం కూడా సంస్థను లాభాలబాటలో పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ జె కిరణ్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస రావు, ఓ సి పి మేనేజర్ రమేష్, డీపీయం రామశాస్ట్రీ, ప్రాజెక్ట్ ఆఫీసర్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment