కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 27 ; సింగరేణి కార్మికులకు లాభాలలో వాటా 27 శాతం ఇస్తున్నందుకు బెల్లంపల్లి ఏరియా ఖైరగుడా ఓపెన్ కాస్ట్ లో బాణాసంచా కాల్చి ముఖ్య మంత్రి కెసిఆర్ చిత్రపటానికి టీజీబీకేష్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగిందని టీజీబీకేష్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస రావు తెలిపారు. అనంతరం సింగరేణి లాభాలలో 27 శాతం కార్మికులకు పంచడానికి ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. టీజీబీకేష్ గౌరవ అధ్యక్షురాలు ఎం పి కవిత, అధ్యక్షులు వెంకట రావు మిరియాల రాజి రెడ్డి ,ల కృషివల్లనే సాధ్యమైనదన్నారు. ఈ కార్యక్రమంలో సదశివ్ ,రాజన్న,వెంకటేష్, తాళ్లపల్లి రాములు,మహబూబ్,చిన్నయ్య,అంజయ్య,స్వామి, కార్నాథమ్ వెంకటేష్, దత్తు,పసుల శంకర్,సమ్మయ్య, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment