కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 15 ; బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ కార్యాలయంలో 72 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు .జనరల్ మేనేజర్ కే .రవిశంకర్ ప్రెతాకావిష్కరణ గావించి ప్రసంగిస్తూ ఎందరో మహనీయుల త్యాగఫలంగా లభించిన స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకోవాలని, చేసే ప్రతి పనిని నిబద్దతతో నిర్వహించాలని తెలిపారు. సింగరేణి సంస్థ గురించి మాట్లాడుతూ సింగరేణి బెల్లంపల్లి ఏరియాలో గత 3 సంవత్సరాలుగా 100 శాతం ఉత్పత్తి లక్ష్యాలను సాధించి, లాభాల బాటలో ఉన్నామని అన్నారు. గత ఆర్ధిక సంవత్సరం 380 కోట్ల లాభాలలో ఉన్నట్లు తెలిపారు. ఉత్తమ కార్మికులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందచేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సింగరేణి సేవ సమితి అధ్యక్షురాలు అనురాధ రవిశంకర్, ఎస్ ఓ టూ జీఎం వీరాస్వామి, డోర్లి పర్సనల్ మేనేజర్ కొండయ్య, డీజీపీఎం జ్ కిరణ్, డీపీఎం లు రాజేశ్వర్, రామశాస్ట్రీ, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస్ రావు, సేవ సమితి సభ్యులు, కార్మికులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment