కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 17 ; రెబ్బెన మండలం గోలేటిలో గురువారం అర్ధరాత్రి అక్రమ రవాణాకు సిద్ధం ఉంచిన సుమారు 2 లక్షల రూపాయల విలువగల 88 టేకు దుంగగాలను స్వాధీనం చేసుకున్నట్లు రెబ్బెన ఎస్సై ఢీకొండ రమేష్ శుక్రవారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి గోలేటి గ్రామ శివారులో టేకు దుంగలను స్వాధీనం చేసుకొని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ కు సమాచారమిచ్చి తదుపరి చర్య నిమిత్తం అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.
No comments:
Post a Comment