కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 28 ; రెబ్బెన మండల కేంద్రంలోని ఫారెస్ట్ నర్సరీ నుండి మండలంలోని గ్రామాలకు మొక్కలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా రెబ్బెన ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగాప్రారంభించిన హరిత హారం కార్యక్రమాన్ని మండలంలోని ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని అన్నారు. గ్రామాలలో ప్రజలందరూ మొక్కలునాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ పి ఓ కల్పన, పంచాయతీ సెక్రటరీలు శంకర్, వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment