Tuesday, 28 August 2018

ఖతార్ వేకువ ఫౌండేషన్ నోట్ పుస్తకాల పంపిణి

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 28 ; రెబ్బెన మండలంలోని తుంగేదా మండల పరిషత్ పాఠశాలలో ఎన్   అర్  ఐ ఖతార్ వేకువ ఫౌండేషన్ మరియు మేధ ప్రాజెక్ట్ వారు పాఠశాలలో చదువుతున్న 69 మంది విద్యార్థిని విద్యార్థులకు సంవత్సరానికి సరిపడా  నోట్ పుస్తకాలు మంగళవారం అందించడం జరిగిందని, 1 వ తరగతి పిల్లలకు పలకలనుఅందచేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగయ్య తెలిపారు. మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామి ఫౌండేషన్ స్పాన్సర్  గణేష్ కుమార్ తో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగవేణి, అరుణ దేవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment