కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 28 ; రెబ్బెన మండలంలోని తుంగేదా మండల పరిషత్ పాఠశాలలో ఎన్ అర్ ఐ ఖతార్ వేకువ ఫౌండేషన్ మరియు మేధ ప్రాజెక్ట్ వారు పాఠశాలలో చదువుతున్న 69 మంది విద్యార్థిని విద్యార్థులకు సంవత్సరానికి సరిపడా నోట్ పుస్తకాలు మంగళవారం అందించడం జరిగిందని, 1 వ తరగతి పిల్లలకు పలకలనుఅందచేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగయ్య తెలిపారు. మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామి ఫౌండేషన్ స్పాన్సర్ గణేష్ కుమార్ తో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగవేణి, అరుణ దేవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment