కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 03 ; రెబ్బెన మండల కేంద్రంలో తహశీల్ధార్ కార్యాలయం ఎదుట శుక్రవారం గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 12 వ రోజు మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్వి జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అర్హులైన వారందరిని కార్యదర్శి గా నియమించాలని డిమాండ్ చేశారు. .జి ఓ సవరించి అందరిని పెర్మనెంట్ చేయాలని అన్నారు. కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చెసారు. ఈ దీక్షలో .ఏఐటీయూసీ జి పి డబ్ల్యూ యూనియన్ మండల అధ్యక్షుడు రాచకొండ రమేష్, కార్యదర్శి దుర్గం వెంకటేష్,వైస్ ప్రెసిడెంట్ గోగర్ల శంకర్, కార్మికులు దేవాజి, వీరయ్య, నారాయణ,లక్ష్మి, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment