Friday, 3 August 2018

గ్రామ పంచాయతీ కార్మికుల మోకాళ్ల నిరసన

కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 03 ; రెబ్బెన మండల కేంద్రంలో తహశీల్ధార్ కార్యాలయం ఎదుట  శుక్రవారం గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 12 వ రోజు మోకాళ్లపై నిలుచుని   నిరసన తెలిపారు. ఈ సందర్భంగా  టిఆర్ఎస్వి జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ  ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అర్హులైన  వారందరిని కార్యదర్శి గా నియమించాలని డిమాండ్ చేశారు. .జి ఓ  సవరించి అందరిని పెర్మనెంట్  చేయాలని అన్నారు. కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చెసారు.   ఈ  దీక్షలో .ఏఐటీయూసీ జి పి  డబ్ల్యూ యూనియన్ మండల అధ్యక్షుడు రాచకొండ రమేష్, కార్యదర్శి దుర్గం వెంకటేష్,వైస్ ప్రెసిడెంట్ గోగర్ల శంకర్, కార్మికులు దేవాజి, వీరయ్య, నారాయణ,లక్ష్మి, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment