Tuesday, 21 August 2018

మనస్తాపంతో సింగరేణి కార్మికుడి మృతి

  
కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 21 ; ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కారుణ్య నియామకాలల్లో  భాగంగా ఆరోగ్యం సహకారించక మెడికల్ బోర్డు కు దరఖాస్తు చేసుకున్న కార్మికులను అన్ ఫిట్ చేయవలసి ఉండగా, కార్మికులను అన్ ఫిట్ చేయకుండా దానికి బిన్నంగా సింగరేణి యాజమాన్యం  వ్యవహరిస్తుందని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి అన్నారు. డి.లింగయ్య అనే కార్మికుడు కైరిగుడా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో కన్వేయర్ ఆపరేటర్ గ విధులు నిర్వహిస్తూ ఆరోగ్యం బాగాలేదని  మెడికల బోర్డుకు దరఖాస్తు చేసుకోగా యాజమాన్యం అన్ ఫిట్ ఫర్ కన్వేయర్ ఆపరేటర్ , ఫిట్ ఫర్ జనరల్ మాజ్దూర్ ఇచ్చినందున  మనస్థాపానికి లోనైన కార్మికుడు మరణించడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యం, గుర్తింపు సంఘం అయిన టీబీజీకేఎస్ బాధ్యత వహించాలని ఏఐటీయూసీ గా డిమాండ్ చేస్తున్నామని అని అన్నారు. మెడికల్ బోర్డ్ కు దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికున్ని  ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment