Thursday, 16 August 2018

ప్రజా సమస్యల పై పోరాడుతాం ; మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్

 కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 16 ; ప్రజా సమస్యలపై పరిష్కారానికి ఆగస్టు పద్ధెనిమిది నాడు కొమురంభీం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జరుగును సామూహిక ధర్నాను విజయవంతం చేయాలని సిపిఐ మాజీ శాసనసభా పక్ష నేత గుండా మల్లేష్ పిలుపునిచ్చారు.  గురువారం అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ్మిడి హెట్టి  వద్ద ప్రాణహిత చేవెళ్ల నదిని నిర్మించకుండా  జిల్లాలో రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం  తీవ్ర అన్యాయం చేసిందని తద్వారా రెండు లక్షల  రెండు లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందని పరిస్థితి నెలకొందని కేవలం రెబ్బెన మండలంలోని పందొమ్మిది వేల ఎకరాల భూమిని సాగు  నీరందేదని  అన్నారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర సర్కారు విఫలం చెందిందని డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు కట్టించకపోవడం అన్యాయమని ఎన్నికల హామీలన్నీ పురస్కరించుకుని ముఖ్యమంత్రి గారు ప్రగతిభవన్ ని  కట్టుకుని పేద ప్రజలను విస్మరించారని  అన్నారు పేదలకు మూడేకరాల భూమి ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవని విమర్శించారు ఆసిఫాబాద్  జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలను నిర్మించాలని డిమాండ్ చేశారు మంచిర్యాల  నుండి వాంకిడి వరకు రాష్ట్రీయ రహదారి గుంతల మయమైందని అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి రహదారుల మరమ్మతులను చేపట్టకపోవడం చేతకాని తనానికి  నిదర్శనమని అన్నారు పల్లెల్లో రోడ్లు డ్రైనేజీ త్రాగునీరు సమస్యలను పరిష్కరించాలని కొన్ని రోడ్లు బురదమయానికి నార్లు వేసేలా ఉన్నాయని  అన్నారు పోడు భూములను సాగు చేస్తున్న రైతులకు పట్టా హక్కులు కల్పించాలని గోలేటి మరియు ఇతర ప్రాంగణంలోని ఇల్లు కట్టుకున్న ప్రజలకు  ఇళ్ల పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మరియు మూడు ఎకరాల వ్యవసాయ భూమిని ఇవ్వాలని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఈకార్యక్రమం లో  మండల కార్యదర్శి ఆయిల్లా  నరసయ్య, ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్, డివిజన్ కార్యదర్శి  పూదరి సాయి కిరణ్, డివిజన్ ఉపాధ్యక్షుడు పర్వతి సాయి కుమార్, సిపిఐ నాయకులు రామడుగుల శంకర్ బద్రీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment