కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన ఆగస్టు 1 ; రెబ్బెన మండలం గోలేటిలోని సింగరేణి హై స్కూల్ లో అటవీ అధికారుల ఆధ్వర్యంలో హరిత హారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్హంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పెంచి పెద్దవి చేయాలని అన్నారు. విద్యార్థులు తమ ఇంటి ఆవరణలో కూడా మొక్కలు పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అక్తరోద్దిన్, హై స్కూల్ హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment