Saturday, 18 August 2018

సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 368వ జయంతి వేడుకలు

  కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 18 ;    శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 368 వ జయంతిని  శనివారం   రెబ్బెన మండల కేంద్రంలోని  అతిధి గృహంలో  గౌడ కులస్థులు  ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ హక్కుల పోరాట సమితిజిల్లాప్రధానకార్యదర్శి  కేసరి ఆంజనేయులుగౌడ్  ముఖ్య అతిధిగ పాల్గొని  మాట్లాడుతూ  ఆనాటి మొఘలుల  కాలంలో పంటల పై వేసే పన్ను కంటే కల్లు  పై వేసే పన్ను అధికంగా ఉండేదని ఆనాడు బిసి కులాలు దళిత వర్గాలను  ఏకం చేసి జమిందారులు, సుబెదరులకు  ఎదురుతిరిగి పోరాటం చేసిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నది అని అన్నారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘ జిల్లా అధ్యక్షుడు మోడెం సుదర్శన్ గౌడ్, అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్, మేడిపల్లి లక్ష్మీనారాయణ, నాయకులూ రంగు మహేష్ గౌడ్, గుడిసెల వెంకటేశ్వర్వుగౌడ్, స్వామి గౌడ్, శ్రవణ్ గౌడ్, శాంతి కుమార్ గౌడ్, బొంగు దేవక్క తదితరులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment