Monday, 6 August 2018

ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి : భోగే ఉపేందర్

కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 06 ; ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని, గ్రామా పంచాయతీ ,కార్మికుల సమస్యలు  వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు, కార్మికుల నిరవధిక సమె నేడు  15 వరోజుకు చేరుకుంది.  రెబ్బన మండల కేంద్రంలో సోమవారం  దీక్ష శిబిరం ను సందర్శించి మాట్లాడారు.గత 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్న కార్మికులను  ప్రభుత్వం పట్టించుకోక పోవడం చాలా బాధకారమని అన్నారు. ఈ దీక్షలో టి ఆర్ ఎస్ కే వి    జిల్లా కార్యదర్శి సుధాకర్,ఏఐటీయూసీ గ్రామ పంచాయతీ  వర్కర్ యూనియన్ ప్రెసిడెంట్ రమేష్,వైస్ ప్రెసిడెంట్ శంకర్,లాలూసింగ్,నాయకులు ప్రకాష్,దేవాజి,సునిల్, విజయ్,తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment