Friday, 31 August 2018

ప్రగతి నివేదన సభకు భారీగా తరలివెళ్ళాలి

కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 31 ; ప్రగతి  నివేదన  సభకు భారీగా, స్వచ్చందంగా  తరలి వెళ్లాలని     రెబ్బెన మండల తెరాస మహిళా అధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ పిలుపునిచ్చారు.శుక్రవారం రెబ్బెన మండల కేంద్రంలో ని అతిధి గృహంలో ఏర్పాటుచేసిన  విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా తెరాస రభుత్వం చేసిన ప్రజోపయోగ పనులను వివరించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటుచేస్తున్న సభను మండలంనుంచి స్వచ్చందంగా భారీ సంఖ్యలో తరలి వెళ్లి సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన మాజీ సర్పంచ్ లు  పెసర వెంకటమ్మ, గజ్జెల సుశీల, గోలేటి ఎంపీటీసీ వనజ తది తరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment