కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 20 ; ఇటీవల కురిసిన భారీవర్షాలకు మంచిర్యాల జిల్లాలో ముంపునకు గురైన గ్రామాలలో పంచిపెట్టడానికి వంట సామాగ్రి, దుప్పట్లు మొదలైన సామానుల ను సిద్ధంగా ఉంచినట్లు బెల్లపల్లి సింగరేణి ఏరియా గోలేటి జనరల్ మేనేజర్ కే రవిశంకర్, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షులు చింతల శ్రీనివాస్, సింగరేణి సేవ సంఘం అధ్యక్షురాలు శ్రీమతి అనిరాధా రవిశంకర్ లు సోమవారం తెలిపారు. మంచిర్యాల జిల్లాలో గత 10 రోజులనుండి కురుస్తున్న భారీ వర్షాలకు పలు అటవీ గ్రామాలు ముంపునకు గురయ్యాయని, మానవతా దృక్పధంతో సహాయంచేయాలని మంచిర్యాల పాలనాధికారి ఆర్ వి కర్ణన్ విజ్ఞప్తికి స్పందించిన ఏరియా అధికారుల సంఘం వారు ఇచ్చిన 58,000 రూపాయల విరాళంతో గృహోపకరణ సామాగ్రి, దుప్పట్లు,బిస్కట్ లు తదితర వస్తువులు కొనుగోలు చేసి పంపిణి కి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ పర్సనల్ జె కిరణ్, డిజిఎం లు ప్రసాదరావు, రాజై, ఫైనాన్స్ మేనేజర్ శ్రీధర్, ఎస్టేట్ ఆఫీసర్ వరలక్ష్మి, డి వై పి ఎం లు రాజేశ్వర్, రామసాస్ట్రీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment