Friday, 10 August 2018

విద్యార్థులకు నులిపురుగుల మాత్రల పంపిణి


  కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 10; జాతీయ నులిపురుగుల నిర్మూలన రోజును  పురస్కరించుకొని శుక్రవారం   రెబ్బెన మండలం జక్కులపల్లి గ్రామ  ప్రాథమిక పాఠశాలలో    విద్యార్థులందరికి అల్బెండజోల్ మాత్రలు వేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  పద్మజ తెలిపారు. ఈ  సందర్బంగా క్లస్టర్ సీఆర్పీ ఎం.రాజేష్ మాట్లాడుతూ నులిపురుగులు కలిగి ఉన్న పిల్లలు  రక్తహీనత,పోషకాహారలోపం,ఆకలిలేకపోవుట,కడుపునొప్పి,వికారం,వాంతులు మరియు  బరువు తగ్గడం వంటి  ఆరోగ్య సమస్యలతో బాధపడతారు.కావున పిల్లలందరూ వ్యక్తిగత ఆరోగ్య పరిశుభ్రత పాటించాలి.పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి,గోర్లని శుభ్రంగా,చిన్నవిగా ఉంచుకోవాలి.ఆహారం పై మూత పెట్టుకోవాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ,ఉపాద్యాయులు ఆనంద్,శ్రీనివాస్  ఏ   ఎన్  ఎం లు  సునీత, కళావతి,   ఆశ కార్యకర్త సుజాత,అంగన్వాడీ టీచర్ లు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment