Tuesday, 24 April 2018

ప్రభుత్వ ఆస్పత్రిలో అల్ఫాహారం పంపిణీ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 24 ; రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో  తెరాస  మహిళా విభాగం జిల్లా  అధ్యక్షులు  కుందారపు శంకరమ్మ   మంగళవారం గర్భిణీ స్త్రీలకు అల్ఫాహారం   పంపిణీచేశారు. ఈ సందర్భంగా కుందారపు శంకరమ్మ మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారికి తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో  మన ముఖ్యమంత్రి  కెసిఆర్   పేరు మీద అల్ఫాహారం పంపిణి   చేపట్టినట్లు  తెలిపారు. తెరాస  పార్టీ కార్యకర్తల తరపు నుంచి ఇలాంటి  కార్యక్రమాలు మరెన్నో చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మన్యం  పద్మ, అన్నపూర్ణ అరుణ ఆసుపత్రి సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment