Wednesday, 18 April 2018

రైలు కిందపడి వ్యక్తి మృతి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 18 ;  రెబ్బెన  మండలం తక్కళ్లపల్లి  రైల్వే గేట్ వద్ద గోలేటి నివాసి  జవ్వాజి  రమేష్,  గుర్తు తెలియని  రైల్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు  బెల్లంపల్లి రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తక్కళ్లపల్లి గేట్ వద్ద మృతదేహం ఉందన్న సమాచారం మేరకు వచ్చి పరిశీలించగా డౌన్  లైన్ పై మృతదేహం పడి  ఉందని బుధవారం ప్రాధమిక దర్యాప్తులో మృతుడు గోలేటి కి చెందిన జవ్వాజి రమేష్ గ    గుర్తించామన్నారు. మృతునికి భార్య సునీత, బాబు మణికంఠ, పాప లక్కీ ఉన్నట్లు తెలిపారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు 

No comments:

Post a Comment