Saturday, 21 April 2018

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: టాస్క్ ఫోర్స్ సి ఐ రాంబాబు



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 21 ;  కుమురం  భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో  ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా  కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ సిఐ  అల్లం రాంబాబు  అన్నారు.  మీ పరిసరాల్లో ఎవరైనా, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లైతే  ప్రజలు వెంటనే సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. పేద    ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న రూపాయి కిలో  సబ్సిడీ బియ్యాన్ని   వ్యాపారంగా మార్చుకుని నిత్యం రోడ్డు మరియు రైలు మార్గం గుండా   మహారాష్ట్ర మరియు ఇతర ప్రదేశాల కు తరలించే అక్రమ  వ్యాపార  ముఠాలకు అడ్డుకట్ట చేస్తామని అన్నారు.   బియ్యం అక్రమ రవాణా చేయడం మానుకోవాలని, లేదంటే తరుచూ దాడులు నిర్వహిస్తామని , బియ్యం అక్రమ రవాణా చేసేవారిని గుర్తించి కేసులు నమోదు  చేస్తామన్నారు. 

No comments:

Post a Comment