Tuesday, 10 April 2018

ఆధునిక సాంకేతికతతో త్వరితగతిన కేసుల పరిష్కారం - జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెనవార్

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్10 ; ఆధునిక సాంకేతికతతో త్వరితగతిన కేసుల పరిష్కారం అయ్యేలా చూడాలని జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెనవార్ అన్నారు. మంగళవారం పోలీస్ హెడ్ క్వార్టర్ నందు ఈ పెట్టి కేసుల నమోదును ప్రారంభించి   జిల్లా లోని   పోలీస్ అధికారుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ     ఈ పెట్టి  కేసులను ఆన్లైన్ లో నమోదు చేయు విదానం ను గురించి జిల్లా అధికారులకు తెలియచేసారు, ఈ పెట్టి కేసు ల నమోదు వల్ల చిన్న నేరాల పట్ల కూడా పోలీస్ లు సత్వరం స్పందించే వీలు ఉంటుందని   జిల్లా ఎస్పి తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు జిల్లా లో వున్నా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు సిబ్బంది శిక్షణ పొందేలా ప్రతి వారం సి సి టి ఎన్   ఎస్  పైన శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందనీ తెలిపారు.
రానున్న ఖరిఫ్ దృష్ట్యా జిల్లా లో కల్తి విత్తనాలు విక్రయాలు జరుగకుండా అవగాహన మరియు ప్రతి మండల హెడ్ క్వార్టర్ ల నందు విస్తృత స్థాయి తనిఖి లను వ్యవసాయ శాఖ అధికారుల సహాయం తో నిర్వహిస్తూ కాల పరిమితి పూర్తి అయిన క్రిమిసంహారక  మందుల ను గుర్తిస్తున్నామన్నారు.  జిల్లా  లో ఎవరైనా కల్తి విత్తనాలను విక్రయిస్తే  సమీప పోలీస్ అధికారులకు లేదా  ఫోన్ నెంబర్ -9000926208  లకు తెలుపవచ్చు అని అయన తెలిపారు. ఈ కార్యక్రమము లో ఆసిఫాబాద్ డిఎస్పి ఆడెపు సత్యనారాయణ,కాగజ్ నగర్ డిఎస్పి,సాంబయ్య, ఎస్బి ఇన్స్పెకర్  కాశయ్య, ఐటి కోర్ ఇన్స్పెకర్ స్వామి, ఐటి కోర్  సభ్యులు జే.శ్రీనివాస్ ,విజయ్ లాల్ మరియు   జిల్లా లోని  సి ఐ లు , ఎస్సై లు పాల్గొన్నారు

No comments:

Post a Comment