Tuesday, 17 April 2018

ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 17 ; రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో  తెరాస  మహిళా విభాగం నుండి  మంగళవారం గర్భిణీ స్త్రీలకు పండ్ల మరియు మజ్జిగ ప్యాకెట్లు  పంపిణీచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ మన ముఖ్యమంత్రి పేరు మీద పండ్ల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తల తరపు నుంచి ఇలాంటి  కార్యక్రమాలు మరెన్నో చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మన్య పద్మ, అన్నపూర్ణ అరుణ ఆసుపత్రి సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment