
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 24 ; రెబ్బన పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ బయట రామగిరి ట్రైన్ లో రవాణా చేయటానికి సిద్ధంగా రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయి అని ఖచ్చితమైన నిఘా సమాచారం తో టాస్క్ ఫోర్స్ సి. ఐ రాంబాబు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ లు మంగళవారం దాడిచేశారు. దాడిలో రైల్వే స్టేషన్ బయటి ఆవరణలో దాట్ల రాజయ్య మరియు మాటురి రజిత అనే ఇద్దరు వ్యక్తులు రవాణాకు సిద్దంగా ఉంచిన 8 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం రెబ్బన పి.ఎస్. పోలీస్ వారికి అప్పగించడం జరిగింది.
No comments:
Post a Comment