Tuesday, 24 April 2018

టాస్క్ ఫోర్స్ దాడిలో రవాణాకు సిద్దంగా ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 24 ; రెబ్బన పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆసిఫాబాద్ రోడ్  రైల్వే స్టేషన్ బయట రామగిరి ట్రైన్ లో రవాణా చేయటానికి సిద్ధంగా రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయి అని  ఖచ్చితమైన నిఘా  సమాచారం తో టాస్క్ ఫోర్స్ సి. ఐ  రాంబాబు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ లు  మంగళవారం  దాడిచేశారు. దాడిలో  రైల్వే స్టేషన్ బయటి ఆవరణలో  దాట్ల రాజయ్య మరియు మాటురి రజిత అనే ఇద్దరు వ్యక్తులు రవాణాకు సిద్దంగా ఉంచిన 8 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం  రెబ్బన  పి.ఎస్. పోలీస్ వారికి  అప్పగించడం జరిగింది.

No comments:

Post a Comment