కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 20 ; వ్యాపారులందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై శివకుమార్ అన్నారు. రెబ్బెన మండలకేంద్రసంలోని అతిథి గృహ ఆవరణలో వ్యాపారస్తులకు సి సి కెమెరాల ఉపయోగాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు నేరస్థుల ఆచూకి కనుగొనడం తేలిక అవుతుందని అన్నారు. సిసి కెమరాల్లో ఏర్పాటు చేసి పోలీసులకు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు గోవింద్ అగర్వాల్ ,అనిల్, ప్రకాష్ ,హాషుముఖఃలాల్ , నీరజ్ జైస్వాల్, కృష్ణ, ఆసన్న, రాము,మాతా ప్రసాద్, తదితర వ్యాపారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment