Friday, 20 April 2018

పాలీసెట్ కు ఏర్పాట్లు పూర్తి


   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 20 ; ఈ నెల 21 న జరగనున్న పాలీసెట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆసిఫాబాద్ కో ఆర్డినేటర్  అజ్మీర  గోపాల్ అన్నారు. శుక్రవారం  అసిస్టెంట్ కో ఆర్డినేటర్ రామకృష్ణ తో కలసి పరీక్షా ఏర్పాట్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ  పరీక్ష ఉదయం 11 నుంచి 1 వరకు ఉంటుందన్నారు. విద్యార్థులను గంట   ముందునుంచె పరీక్షా హాల్ లోనికి అనుమతిస్తారన్నారు. . ఎటువంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను  తీసుకొని  రాకూడదని అన్నారు. ఒక నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఉండదన్నారు. పరీక్ష  కు హాజరయ్యే అభ్యర్థులు ఈ సూచనలను గమనించాలన్నారు. 

No comments:

Post a Comment