కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 20 ; ఈ నెల 21 న జరగనున్న పాలీసెట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆసిఫాబాద్ కో ఆర్డినేటర్ అజ్మీర గోపాల్ అన్నారు. శుక్రవారం అసిస్టెంట్ కో ఆర్డినేటర్ రామకృష్ణ తో కలసి పరీక్షా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్ష ఉదయం 11 నుంచి 1 వరకు ఉంటుందన్నారు. విద్యార్థులను గంట ముందునుంచె పరీక్షా హాల్ లోనికి అనుమతిస్తారన్నారు. . ఎటువంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తీసుకొని రాకూడదని అన్నారు. ఒక నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఉండదన్నారు. పరీక్ష కు హాజరయ్యే అభ్యర్థులు ఈ సూచనలను గమనించాలన్నారు.
No comments:
Post a Comment