Wednesday, 11 April 2018

మహాత్మజ్యోతిబాఫూలే సేవలు చిరస్మరణీయం ; సంయుక్త పాలనాధికారి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్ 11; భారతమాత ముద్దబిడ్డ, బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మజ్యోతిబాఫూలే అని ఆయన  చేసిన సేవలు చిరస్మరణీమని  కొమురంభీం జిల్లా సంయుక్త పాలనాధికారి ఆశోక్ కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలో     మహాత్మ జ్యోతిబా ఫూలే 192 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
  ఈ సందర్భంగా సంయుక్త  మాట్లాడుతూ   అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ, అట్టడుగు వర్గాలకు విద్యావకాశాలు కల్పిస్తూ, నిరుపేద బడుగుబనహీన వర్గాల కోసం జీవితమంతా ఒంటిరిగా పోరాడిన మహావ్యక్తి ఫూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా  అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment