కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 5 ; రెబ్బెన: బాబు జగ్జీవన్ రామ్ 111 వ జయంతి ఉత్సవాలను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల రెవిన్యూ కార్యాలయం లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్ధార్ సాయన్న జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. డా: బాబు జగ్జీవన్ రామ్ స్వతంత్ర సమరయోధుడిగా,సంఘ సంస్కర్తగా భారతావనికి విశిష్ట సేవలందించారని వారి సేవలు మరువ లేనివని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ విఆర్వోలు ఉమ్లాల్,ధోని బాపు గ్రామస్థులు శెంకర్,దుర్గం రాజేష్,శ్రీను, లాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment