Wednesday, 11 April 2018

బీజేపీ ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే 192 జయంతి ఉత్సవాలు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్  11; కొమురంభీం జిల్లా గోలేటి లోని బీజేపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే 192 వ జయతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. బీజేపీ జిల్లాఅధ్యక్షులు జె  బి పౌడెల్  మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాలవారికి విద్యాభ్యాసాన్ని అందించి వారి ఉన్నతికి ఏంటో పాటుపడ్డారని అన్నారు.  ఈ కార్యక్రమములో జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులుగౌడ్. జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్. అసెంబ్లీ కన్వీనర్ గుల్బం చక్రపాణి. మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ. ప్రధాన కార్యదర్శి మల్రాజు రాంబాబు. బిజెవైయం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని రాము తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment