Tuesday, 17 April 2018

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 17 ;  రెబ్బన మండలంలోని  మంగళవారం ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద రవాణాకు తయారుగా ఉన్న   రేషన్ బియ్యంను టాస్క్ ఫోర్స్ సి ఐ   రాంబాబు  పట్టుకున్నారు. విలేకరులతొ మాట్లాడాతు   ఎస్పీ కల్మేశ్వర్ సింగన్ వార్ ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్ బయట రామగిరి ట్రైన్ లో రవాణా చేయటానికి సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయి అని  ఖచ్చితమైన నిఘా  సమాచారం తో టాస్క్ ఫోర్స్  నేతృత్వంలోని  రైల్వే స్టేషన్ బయటి ఆవరణలో తనిఖీ చేయగా పూధరి భీమక్క, పూధరి అనిత, పూధరి పార్వతి మరియు కుందారపు పుల్లయ్యలు రవాణాకు సిద్దంగా ఉంచిన 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం  రెబ్బన పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది అని తెలిపారు. వీరితో పాటు టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్  తదితర సిబ్బంది ఉన్నారు.

No comments:

Post a Comment