Wednesday, 25 April 2018

మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలి ; చీఫ్ ఇంజనీర్ జగన్మోహాన్ రెడ్డి


 
   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 25 ; ఆసిఫాబాద్ జిల్లా లోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నందున మిషన్ భగీరథ పనులు వేగవంతం చేసి ఇంటింటికీ నల్లా నీరు అందించాలని చీఫ్ ఇంజనీర్  జగన్మోహాన్ రెడ్డి అన్నారు. బుధవారం అధికారులు, ఇంజనీర్లతో జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్  సమీక్ష సమావేశంను నిర్వహించారు.ఈ సందర్బంగా చీఫ్ ఇంజనీర్  జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతు ముఖ్యమంత్రి చేపట్టిన  మిషన్ భగీరథ  భాగంగా ఇంటింటికీ  నల్లా నీరు అందించే విదంగా  పనులలో వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. కొండల్లో గుట్టలల్లో  పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతు ఇఇలు,ఏఇల పనుల తీరును అడిగి తెలుసుకున్నారు.మండలం లోని హబిటేషన్  మిషన్ భగీరథ పనులు పదిహేను రోజుల్లో పూర్తిచేయాలన్నారు. తప్పుడు సమాచారం ఇవ్వకుండా సరైన సమాచారం అందజేయాలన్నారు. మిగతా జిల్లాల్లో ఎలా ఉందో ఈ జిల్లాలో కూడా పూర్తి సమాచారంతో మిషన్ భగీరథ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి  ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొని  వచ్చే నెల వరకు ప్రజలందరికీ త్రాగునీటి సౌకర్యం కల్పించే విధంగా కృషిచేయాలన్నారు. ఆవిధంగా ఇంటింటికి నల్లానీరు పనులపై సమీక్షించారు ఆగస్టునెల వరకు ఇంటికి నీరందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ ఇ  ప్రకాశ్ రావు, ఈ ఈ రమణ, డిప్యూటీ ఇఇ  నాగేశ్వరరావు, ఎల్&టి సుబ్రహ్మణ్యం, మెగా ప్రాజెక్ట్ మేనేజర్లు అసిస్టెంట్లు ఈ ఈ  వివిధ మండలాల నుండి వర్కర్స్ ఏజెన్సి కాంట్రాక్టులు తదితరు పాల్గొన్నారు.

No comments:

Post a Comment