Wednesday, 18 April 2018

ఆర్ టి సీ బస్సు కారు ఢీ : ఒకరి మృతి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 18 ; రెబ్బెన మండలం తక్కెళ్ల పల్లి వద్ద బుధవారం ఆర్ టి సి బస్సు కారు   ఢీ  కొన్న ప్రమాదంలో    మంచిర్యాల నివాసి  రాథోడ్ క్రాంతి(24) అక్కడికక్కడే    మృతి చెందినట్లు,   సర్కిల్ ఇన్సపెక్టర్ పురుషోత్తం చారి తెలిపారు.  ఆయన  తెలిపిన వివరాల ప్రకారం మృతుడు మంచిర్యాల గౌతంనగర్ నివాసి అని  కాగజ్ నగర్ లో జరిగిన ఒక ఇంజనీరింగ్ షాప్ ప్రారంభోత్సవానికి   వెళ్లి తిరుగు ప్రయాణంలో తక్కళ్లపల్లి వద్ద మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్న ఆర్ టి సి బస్సు నెంబర్  ఏ పి   28 జెడ్ 5477  వీరు ప్రయాణిస్తున్న మారుతి కారు  నెంబర్  ఏ  పి  25 సీ  4000 ఎదురెదురుగా   ధీ కొనడంతో  ప్రమాదం జరిగినట్లు తెలిపారు. గాయపడిన జంజిరాల  రాము అనే వ్యక్తిని   బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

No comments:

Post a Comment