Tuesday, 24 April 2018

టాస్క్ ఫోర్స్ మెరుపు దాడిలో మద్యం మరియు బెల్లం నిల్వ పట్టివేత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 24 ; ఆసిఫాబాద్ చిర్రకుంట గ్రామంలో అక్రమ మద్యం మరియు బెల్లం నిల్వలు న్నాయన్న  ఖచ్చితమైన నిఘా  సమాచారం తో ఎస్పీ కల్మేశ్వర్ సింగన్ వార్ ఆదేశాల మేరకు   టాస్క్ ఫోర్స్  సి. ఐ అల్లం రాంబాబు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్  లు   మంగళవారం సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.   చిర్రకుంట గ్రామంలో  తనిఖీ చేయగా అరిగెల మవిన్ కుమార్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 10,220/- విలువగల మద్యం మరియు 15 కిలోల  ల బెల్లం, కోట కుమార్ ఇంట్లో  10,710/- విలువగల అక్రమ మద్యం మరియు జమ్ముల రమేష్ షాపులో 6,215/- విలువగల మద్యం స్వాధీనం చేసుకొని కేసు ను  తదుపరి విచారణ నిమిత్తం ఆసిఫాబాద్ పి.ఎస్. పోలీస్ వారికి  అప్పగించడం జరిగింది.

No comments:

Post a Comment