Friday, 13 April 2018

32 వ వేణుగోపాల్ స్మారక ఇన్విటేషనల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ప్రారంభం


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్  13 ; బెల్లంపల్లి సింగరేణి  ఏరియా గోలేటి భీమన్న స్టేడియం లో ఈ రోజు 32 వ వేణుగోపాల్ స్మారక ఇన్విటేషనల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ను శుక్రవారం జనరల్ మేనేజర్ కె  రవిశంకర్ ప్రారంభించారు. ఈ రోజు నుండి 15 వ తేదీవరకు జరిగే ఈ టౌర్నమెంట్లో ఖమ్మం, హైదరాబాద్, పాల్వంచ, గద్వాల్, కరీంనగర్, ఆదిలాబాద్,గుంటూరుల నుండి జట్లు పాల్గొంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టూ  జీఎం  ఎం శ్రీనివాస్, డిజిఎం  పర్సనల్ జె  కిరణ్, టి జి బి కే ఎస్  వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస్ రావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ మోహన్ రెడ్డి, స్పోర్ట్స్ ఆఫీసర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment