కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 25 ; రెబ్బెన మండలం తక్కళ్లపల్లి రేపల్లెవాడ మధ్యలో డౌన్ లైన్ పై ఖైర్గాం గ్రామానికి చెందిన తౌటి శ్రీనివాస్ (38) గుర్తు తెలియని రైల్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు బెల్లంపల్లి రైల్వే ఎస్సై జితేందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తక్కళ్లపల్లి రేపల్లెవాడ మధ్య డౌన్ లైన్ పై మృతదేహం ఉందన్న సమాచారం మేరకు వచ్చి పరిశీలించగా ప్రాధమిక దర్యాప్తులో మృతుడు ఖైర్ గాం కుచెందిన లారీ డ్రైవర్ తౌటి శ్రీనివాస్ (38) గా గుర్తించినట్లు తెలి పారు. మృతుని కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు. తీవ్ర అనారోగ్య సమస్యతో మృతుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
No comments:
Post a Comment