Wednesday, 18 April 2018

మృగాళ్లకు బలైన ఆసిఫా ఆత్మశాంతికి క్రొవ్వొత్తి ర్యాలీ

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 18 ; జమ్మూ కాశ్మీర్ లో మానవ  మృగాళ్ల వికృత చేష్టకు    బలైన ఆసిఫా ఆత్మకు శాంతి చేకూరాలని బుధవారం రెబ్బెన గ్రామ పంచాయితీ యూత్ ఆధ్వర్యంలో రెబ్బెన గ్రామంలోని యువకులు , గ్రామస్తులు పెద్దఎత్తున క్రొవ్వొత్తి ర్యాలీ  నిర్వహించారు.   ప్రధాన రహదారిపై గవర్నమెంట్ హై స్కూల్ నుంచి రెబ్బెన మండల కార్యాలయం వరకు   ర్యాలీ  నిర్వహించారు.  అనంతరం వారు మాట్లాడుతూ ఇటివంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులకు త్వరగా శిక్ష విధించేలాగా చట్టాలను మార్చాలని డిమాండ్ చేసారు.   ఈ ర్యాలీ  లో రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ,  ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, సింగల్ విండో డైరెక్టర్ మధునయ్య నవీన్ కుమార్ జైస్వాల్, మోడెమ్ చిరంజీవీ  , మోడెమ్సుదర్శన్ గౌడ్,గోగర్ల .ప్రవీణ్ , జాకిర్ ఉస్మాని, షైక్ మన్సూర్ అహ్మద్, షైక్ ఉబైదుల్ల,సయ్యద్  అఫ్రోజ్,జహూర్ షైక్, జాకిర్ చాచా , వినోద్ జైస్వాల్,భార్గవ్,   మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో   పాల్గొన్నారు.

No comments:

Post a Comment