కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 16 ; బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటి భేమన్న స్టేడియంలో 13 వ తేదీ నుండి జరిగిన వేణుగోపాల్ మెమోరియల్ ఇన్విటేషనల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ చివరి రోజున ముఖ్య అతిధిగా ఇంచార్జి జీఎం కే కొండయ్య పాల్గొని విజేతలకు కాష్ ప్రైజ్ మరియు జ్ఞాపికలను అందచేశారు. ఈ పోటీలో హైదరాబాద్ నవాబ్ జట్టు విజేతగా నిలిచింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మొత్తం 13 టీంలు పాల్గొన్నాయని అన్నారు.ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారన్నారు. సింగరేణి సంస్థ కేవలం ఉత్పత్తే కాకుండా కార్మికులలో క్రీడాసక్తిని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ జె కిరణ్, ఎస్ ఓ టూ జీఎం శ్రీనివాస్ , మేనేజర్ దొర్లి రాజేశ్వర్, ,టి జి బి కె ఎస్ నాయకులూ మంగీలాల్, ఉమాకాంత్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment